Stampede: బీహార్‌లోని సిద్ధేశ్వర్‌నాథ్ ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురి మృతి

7 killed several injured in stampede at Jehanabads Siddheshwar Nath temple
  • మృతుల్లో ఆరుగురు మహిళలు.. 12 మందికిపైగా గాయాలు
  • శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయానికి పెద్ద ఎత్తున మహిళలు
  • రాత్రి 1.00 గంట సమయంలో తొక్కిసలాట
బీహార్‌లో ఓ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 12 మందికిపైగా గాయపడ్డారు. జెహనాబాద్ జిల్లాలోని వనవార్ హిల్స్‌లో ఉన్న బాబా సిద్ధేశ్వర్‌నాథ్ ఆలయంలో ఈ తెల్లవారుజామున 1.00 గంటకు జరిగిందీ ఘటన. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. తొక్కిసలాటపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సదర్ ఆసుపత్రికి తరలించారు.

శ్రావణ మాసం నాలుగో సోమవారం (మనకి కాదు) పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున శివాలయానికి తరలివచ్చారు. ఆదివారం రాత్రి నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వేచి ఉండడం, సమయం  గడుస్తున్న కొద్దీ మరింత మంది భక్తులు వచ్చి చేరుతుండడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మహిళలు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Stampede
Bihar
Jehanabad
Siddheshwar Nath Temple

More Telugu News