ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్ట్లకు రక్షణ లేదా?: కేటీఆర్
- జర్నలిస్ట్ల పట్ల పోలీసుల వైఖరిని ఖండించిన కేటీఆర్
- నిన్న బల్కంపేటలో మహిళా జర్నలిస్ట్ల పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం
- ఈరోజు ఓయూలో రిపోర్టర్ గల్లా పట్టి అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపాటు
జర్నలిస్ట్ల పట్ల పోలీసుల వైఖరిని ఖండిస్తున్నట్లు చెప్పారు. నిన్న బల్కంపేటలో మహిళా జర్నలిస్ట్ల పట్ల దురుసుగా ప్రవర్తించారని, ఈరోజు ఓయూలో రిపోర్టర్ గల్లా పట్టి అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. జర్నలిస్ట్లకు రక్షణ లేదా? అని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన జర్నలిస్ట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.