వైసీపీ పార్టీ కార్యాలయాల కూల్చివేతలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

వైసీపీ కార్యాలయాలు కూల్చివేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేతల్లో చట్టపరమైన నిబంధనలు పాటించాలని సూచించింది. అలాగే, ప్రతి దశలోనూ వైసీపీ తరపున వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని పేర్కొంది. ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఉన్న సందర్భంలో కూల్చివేతలపై ఆలోచనలు చేయాలని సూచించింది.

YCP Offices
Andhra Pradesh
AP High Court
Telugudesam

More Telugu News