ఇసుకను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు
- ఉద్దండరాయునిపాలెంలో ఇసుక లారీలను పట్టుకున్న పోలీసులు
- రెండు లారీలు, కారు స్వాధీనం
- ప్రభుదాస్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు
తాజాగా, బాపట్ల వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు ప్రభుదాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇసుక అక్రమ తరలింపు వ్యవహారంలో ఆయనను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఉద్దండరాయునిపాలెంలో ఇసుకను తరలిస్తున్న లారీలను పట్టుకున్న తుళ్లూరు పోలీసులు ప్రభుదాస్ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రెండు లారీలు, కారును స్వాధీనం చేసుకున్నారు.