CS Neerabh Kumar Prasad: ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం పొడిగింపు

AP CS Neerabh Kumar Prasad Tenure Extension
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్ర‌భుత్వం పొడిగించింది. జులై 1 నుంచి డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు ఆయ‌న స‌ర్వీసును పొడిగిస్తూ డీఓపీటీ ఉత్త‌ర్వులు జారీ చేసింది. కాగా, నీరభ్‌ కుమార్‌ ప్రసాద్ ఈ నెల మొదటి వారంలో ఏపీ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన విష‌యం తెలిసిందే. 

ఇక ఆయన పదవీకాలం ఈ నెలాఖరులో ముగియనుంది. అయితే, ఏపీ ప్రభుత్వం ఆయన సేవలు కొనసాగించాలని భావించి సీఎం చంద్ర‌బాబు కేంద్రానికి లేఖ రాశారు. చంద్ర‌బాబు అభ్య‌ర్థ‌న మేర‌కు తాజాగా సీఎస్ ప‌ద‌వీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ఉత్త‌ర్వులు జారీ చేసింది.
CS Neerabh Kumar Prasad
Andhra Pradesh

More Telugu News