ప్యాసింజర్ రైలుని ఢీకొన్న గూడ్స్ ట్రైన్.. ఐదుగురి మృతి
- 20-25 మంది ప్రయాణికులకు గాయాలు
- పట్టాలు తప్పిన కంచన్జుంఘా ఎక్స్ప్రెస్కు చెందిన 2 కోచ్లు
- పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం
- ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు
ఈ రైలు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎక్స్ వేదికగా స్పందించారు. డాక్టర్లు, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని ఆమె తెలిపారు. డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి ఇప్పుడే తెలిసిందని, ఈ వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని ఆమె చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందన్నారు. కంచన్జుంఘా ఎక్స్ప్రెస్ను గూడ్స్ రైలు ఢీకొట్టినట్లు సమాచారం అందిందని చెప్పారు. డీఎం, ఎస్పీ, వైద్యులు, అంబులెన్స్లు, విపత్తు నిర్వహణ బృందాలను అక్కడికి తరలించామని తెలిపారు. సహాయ చర్యలు యుద్ధ ప్రతిపాదికన ప్రారంభమయ్యాయని ఆమె వివరించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.