Chandrababu: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన చంద్రబాబు

Chandrababu meets AP governor

  • రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
  • మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను కలిసిన టీడీపీ అధినేత
  • ప్రభుత్వ ఏర్పాటు, మంత్రుల కూర్పును వివరించిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం రాజ్ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. టీడీపీ అధినేత... రేపు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రుల కూర్పునకు సంబంధించి గవర్నర్‌కు చంద్రబాబు వివరించారు.

ఉదయం ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలు సమావేశమై... శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన లేఖను కూటమి నేతలు గవర్నర్‌కు అందించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్... చంద్రబాబును ఆహ్వానించారు.

  • Loading...

More Telugu News