రామోజీరావుకు వెంకయ్య నాయుడు, చిరంజీవి నివాళి
- మీడియా మొఘల్ మృతిపై ప్రముఖుల సంతాపం
- వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగారంటూ రామోజీరావుకు వెంకయ్య నాయుడి నివాళి
- ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతమంటూ చిరంజీవి పోస్ట్
గత కొంత కాలంగా వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రామోజీరావు శనివారం తెల్లవారు జామున 4.50 గంటలకు కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వైద్యులు స్టెంట్ అమర్చారు. ఆ తరువాత ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలించారు.