కన్యాకుమారిలో ముగిసిన ప్రధాని మోదీ ధ్యానం
- కన్యాకుమారిలో మగిసిన 45 గంటల ధ్యానం
- రెండు రోజుల క్రితం ఏకాంత ధ్యానముద్రలోకి మోదీ
- వివేకానంద రాక్ మెమోరియల్లో మెడిటేషన్
సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు ముగిసిన వెంటనే పంజాబ్ నుంచి వెనుదిరిగిన మోదీ... తమిళనాడులోని భగవతి అమ్మాన్ ఆలయంలో ముందుగా పూజలు నిర్వహించారు. అనంతరం ఓ పడవలో బయలుదేరి సముద్రం మధ్యలోని శిలా స్మారకాన్ని చేరుకొని రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. తొలుత సూర్యోదయం సమయంలో సూర్య ఆర్ఘ్యం సమర్పించిన తర్వాత ధ్యానం ప్రారంభించారు.