రేవంత్ రెడ్డి వారానికోసారి ఢిల్లీకి వెళుతున్నారు... ఆ విమానంలో కప్పాన్ని తరలిస్తున్నారు: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
- ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లే ముందు ఆయన విమానాన్ని ఎన్నికల సంఘం తనిఖీ చేయాలని విజ్ఞప్తి
- రాష్ట్రానికి సంపద తగ్గిపోతున్నప్పటికీ... మంత్రుల ఆదాయం మాత్రం పెరుగుతోందని వ్యాఖ్య
- మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణల మీద సీఎం స్పందించాలని డిమాండ్
ధాన్యం కొనుగోలు, సేకరణలో నాడు బీఆర్ఎస్ దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో వివిధ మంత్రిత్వ శాఖలపై వస్తోన్న ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలన్నారు. మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణల మీద విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.