Tanguturi: టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు కన్నుమూత

Tanguturi Prakasam Pantulu Grandson Dead
  • కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న టంగుటూరి గోపాల కృష్ణ
  • హైదరాబాద్ లో సోమవారం వేకువజామున తుదిశ్వాస 
  • ప్రకాశం పంతులు రెండో కుమారుడి సంతానమే గోపాల కృష్ణ

ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు టంగుటూరి గోపాల కృష్ణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోపాల కృష్ణ హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున గోపాల కృష్ణ తన నివాసంలో తుదిశ్వాస వదిలారు. ప్రకాశం పంతులుకు ఇద్దరు కుమారులు కాగా.. రెండో కుమారుడు హనుమంతరావు కుమారుడే గోపాల కృష్ణ. టంగుటూరి గోపాల కృష్ణ మరణంతో ఆయన కుటుంబంలో విషాద చాయలు అలముకున్నాయి.

  • Loading...

More Telugu News