ఐపీఎల్ పైనల్‌కు పోటెత్తిన సినీ తారలు

ఐపీఎల్ ఫైనల్‌ను కనులారా వీక్షించేందుకు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖ సినీ తారలు పోటెత్తారు. వెంకటేశ్, రాజ్‌కుమార్‌రావు, జాన్వీకపూర్, అనన్యపాండే, మహేశ్వరి తదితర నటులు అభిమానులతో కలిసి మ్యాచ్‌ను వీక్షించారు. కోల్‌కతా ఫ్రాంచైజీ యజమాని షారూఖ్‌ఖాన్, ఆయన భార్య గౌరీఖాన్, కుమార్తె సుహానాఖాన్, జుహీచావ్లా తదితరులు గ్యాలరీ నుంచి జట్టును ప్రోత్సహించారు. జట్టు వికెట్లు తీసిన, సిక్సర్లు బాదిన ప్రతిసారి చప్పట్లతో హోరెత్తించారు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఐపీఎల్ 17 ఫైనల్‌లో కోల్‌కతా ఘన విజయం సాధించి మూడోసారి ట్రోఫీ అందుకుంది. తిరుగులేని బ్యాటింగ్‌తో లీగ్ దశలో దుమ్మురేపిన హైదరాబాద్ ఫైనల్‌లో 113 పరుగులకే కుప్పకూలింది. దీంతో హోరాహోరీగా జరుగుతుందనుకున్న ఫైనల్ చప్పగా సాగింది. హైదరాబాద్ నిర్దేశించిన 114 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ 10.3 ఓవర్లలోనే ఛేదించి మూడో ట్రోఫీని అందుకుంది.
     


More Telugu News