KTR: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? అంటే... కేటీఆర్ సమాధానం ఇదీ!

KTR predicts AP politics

  • ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్
  • జగన్ గెలుస్తారని తమకు సమాచారం ఉందని వ్యాఖ్య
  • తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పందించిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైఎస్ జగన్ గెలుస్తున్నారని తమకు సమాచారం ఉందని వ్యాఖ్యానించారు. ఆయన ఈ రోజు హైదరాబాదులోని తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలపై స్పందించాలని జర్నలిస్ట్ ప్రతినిధులు కోరారు. దీంతో కేటీఆర్ పైవిధంగా స్పందించారు.

అంతకుముందు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కూడా ఏపీ రాజకీయాలపై స్పందించమని మీడియా ప్రతినిధులు కోరారు. ఆయన నో కామెంట్ అని చెప్పారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులు పదేపదే అడగడంతో ఎన్డీయే తప్పకుండా విజయం సాధిస్తుందన్నారు.

  • Loading...

More Telugu News