IPL 2024: వర్షం వల్ల ఆలస్యంగా ప్రారంమైన ఐపీఎల్ మ్యాచ్... ఓవర్ల కుదింపు

Rain delayed match started lately
  • ఐపీఎల్ లో ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్ × ముంబయి ఇండియన్స్
  • కోల్ కతాలో వర్షం
  • ఆలస్యంగా టాస్... 16 ఓవర్లకు కుదించిన అంపైర్లు
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి 

ఐపీఎల్ లో నేడు కోల్ కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్ మధ్య లీగ్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న కోల్ కతా నగరంలో వర్షం పడడంతో మ్యాచ్ నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా ప్రారంభమైంది. వర్షం ఆగిన తర్వాత మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు ఓవర్లను 16కి కుదిరించారు. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా జట్టు 7 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. కోల్ కతా ఓపెనర్ సునీల్ నరైన్ (0) డకౌట్ కాగా, మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ 6 పరుగులకే వెనుదిరిగాడు.

కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (7) నిరాశపర్చగా... వెంకటేశ్ అయ్యర్ 37, నితీశ్ రానా 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. ముంబయి బౌలర్లలో నువాన్ తుషార 1, బుమ్రా 1, అన్షుల్ కాంభోజ్ 1 వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News