Chandrababu: పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఓటు వేసేందుకు సొంతూళ్లకు తరలి రావాలి: చంద్రబాబు పిలుపు

Chandrababu calls Andhra people in other states should come to vote
  • ఎల్లుండి మే 13న ఏపీలో పోలింగ్
  • రాష్ట్ర దశ, దిశను మార్చే పోలింగ్ అంటూ చంద్రబాబు ట్వీట్
  • ప్రజా చైతన్యం వెల్లివిరియాలన్న టీడీపీ అధినేత  
రాష్ట్ర దశ, దిశను మార్చే ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడిందని, మే 13వ తేదీన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఉపాధి, ఉద్యోగ అవసరాల నిమిత్తం పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు... ఓట్లు వేసేందుకు సొంతూళ్లకు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. 

"ప్రజా చైతన్యం వెల్లివిరియాలి... రాష్ట్ర భవిష్యత్ ను మార్చేందుకు మీ ఓటే కీలకం. మీతో పాటు మరో నలుగురు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా వారిని ప్రోత్సహించండి. మీ భవిష్యత్తును, మీ రాష్ట్ర భవిష్యత్తును మార్చేది మీరు వేసే ఓటే. నిర్భయంగా, నిజాయతీగా, స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
Chandrababu
Voters
Other States
Andhra Pradesh
Polling
General Elections-2024

More Telugu News