పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఏంటి?: చంద్రబాబు
- పాస్ పుస్తకాల జిరాక్స్ కాపీలను తగులబెట్టాలని చంద్రబాబు పిలుపు
- అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని హామీ
- రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలను పునర్ముద్రిస్తామని వెల్లడి
తాము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని ప్రజలకు హామీనిచ్చారు. పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకని ఆయన నిలదీశారు. ఎన్డీఏ ఆధ్వర్యంలోని కూటమి అధికారంలోకి రాగానే రాజముద్రతో వాటిని పునర్ముద్రిస్తామని చంద్రబాబు తెలిపారు. సోమవారం జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.