BJP: సునీతా మహేందర్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు

  • ఈటల రాజేందర్‌పై సునీతా మహేందర్ రెడ్డి మార్ఫింగ్ వీడియోలతో అసత్య ప్రచారం చేశారని ఫిర్యాదు
  • సీఈవో వికాస్ రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ ప్రతినిధుల బృందం
  • వీడియోలు మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
BJP complaints against Sunitha Mahendar Reddy to EC

మల్కాజ్‌గిరి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డిపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తమ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై సునీతా మహేందర్ రెడ్డి మార్ఫింగ్ వీడియోలతో అసత్య ప్రచారం చేశారని సీఈవో వికాస్ రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీజేపీ ప్రతినిధుల బృందం ఫిర్యాదు చేసింది. వీడియోలు మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News