Stock Market: లాభాల్లో ప్రారంభమై నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు
  • 383 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 140 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత చివరి వరకు నష్టాల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 383 పాయింట్లు నష్టపోయి 73,511కి పడిపోయింది. నిఫ్టీ 140 పాయింట్లు కోల్పోయి 22,302కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (5.51%), టెక్ మహీంద్రా (2.37%), నెస్లే ఇండియా (2.06%), టీసీఎస్ (1.36%), ఐటీసీ (1.55%),     

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-3.62%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.05%), టాటా మోటార్స్ (-2.72%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-2.41%), ఎన్టీపీసీ (-2.16%).

  • Loading...

More Telugu News