Dharmashala: మంచుకొండల్లో మ్యాచ్... చెన్నై సూపర్ కింగ్స్ పై టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

  • ఇవాళ ధర్మశాలలో సీఎస్కే × పంజాబ్ కింగ్స్
  • ఈ సీజన్ లో ధర్మశాలలో ఇదే మొదటి మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
Punjab Kings won the toss against CSK

ఐపీఎల్ తాజా సీజన్ లో ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ ఢీకొంటున్నాయి. హిమాలయ పర్వత సానువుల్లోని ధర్మశాల స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ సీజన్ లో ధర్మశాలలో జరుగుతున్న తొలి ఐపీఎల్ మ్యాచ్ ఇదే. ఈ పోరులో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. 

వరుసగా రెండు మ్యాచ్ ల్లో నెగ్గి ఊపుమీదున్న పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ కోసం ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగుతోంది. అటు చెన్నై జట్టులో ఫిజ్ స్థానంలో సీనియర్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ జట్టులోకి వచ్చాడు. ఇరుజట్ల మధ్య ఈ నెల 1న చెన్నైలో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టే విజయం సాధించింది. ఇప్పుడు తటస్థ వేదికపై మ్యాచ్ జరుగుతుండడంతో విజయం ఎవరిదన్న అంశం ఆసక్తి కలిగిస్తోంది. 

టోర్నీలో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ 10 మ్యాచ్ ల్లో 5 విజయాలతో ఐదో స్థానంలో కొనసాగుతుండగా, పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్ ల్లో 4 విజయాలతో ఎనిమిదో స్థానంలో ఉంది.

  • Loading...

More Telugu News