IPL 2024: టాస్ నెగ్గిన ముంబయి ఇండియన్స్... 28 రన్స్ కే 3 వికెట్లు కోల్పోయిన కోల్ కతా

  • ముంబయి వాంఖెడే స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్
  • ఓపెనింగ్ స్పెల్ లో మూడు వికెట్లు తీసిన తుషార
KKR lost early 3 wickets

తాజా ఐపీఎల్ సీజన్ లో పేలవంగా ఆడుతున్న ముంబయి ఇండియన్స్ ఇవాళ బలమైన కోల్ కతా నైట్ రైడర్స్ ను ఢీకొంటోంది. ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన కోల్ కతా ఓపెనర్ ఫిల్ సాల్ట్ ను ముంబయి పేసర్ నువాన్ తుషార పెవిలియన్ చేర్చాడు. 

ఆ తర్వాత తుషార... రఘువంశీ (13), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (6) లను కూడా అవుట్ చేశాడు. దాంతో కోల్ కతా జట్టు 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్ క్రీజులో ఉన్నారు. కాగా, పాయింట్ల  పట్టికలో కోల్ కతా రెండో స్థానంలో ఉండగా, ముంబయి 9వ స్థానంలో కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News