ముస్లింల మద్దతు ఎప్పటికీ కాంగ్రెస్ కే వుంటుంది: తుమ్మల నాగేశ్వరరావు
- కాంగ్రెస్ అంటేనే ముస్లింల పార్టీ అని వ్యాఖ్య
- ముస్లింల త్యాగఫలంతోనే కాంగ్రెస్ ఈ స్థానంలో ఉందన్న తుమ్మల
- ముస్లింలు ఎక్కడ ఉంటే అక్కడ కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా
ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ పరిధిలో జరిగిన ప్రచార కార్యక్రమంలో తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముస్లింలు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి అండగానే ఉన్నారని చెప్పారు. ముస్లింల మద్దతు ఎప్పటికీ కాంగ్రెస్ కేనని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే ముస్లింల పార్టీ అని... ఈ పార్టీ ముస్లింలకే సొంతమని చెప్పారు. ముస్లింల అండతో ఈ లోక్ సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు.
ముస్లింల త్యాగఫలంతోనే కాంగ్రెస్ పార్టీ ఈ స్థానంలో ఉందని తుమ్మల చెప్పారు. ముస్లింలు ఎక్కడ ఉంటే అక్కడ కాంగ్రెస్ గెలుపు ఖాయమని అన్నారు. అల్లాహ్ దయ, కృప కాంగ్రెస్ పై ఉంటాయని చెప్పారు. తెలంగాణలో మెజార్టీ ఎంపీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.