కాంగ్రెస్ కోరుకుంటున్నది జరగనివ్వను: మోదీ
- మత రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ యత్నిస్తోందన్న మోదీ
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను లాక్కునే ప్రయత్నం చేస్తోందని మండిపాటు
- కాంగ్రెస్ దురుద్దేశాలను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచన
కాంగ్రెస్ దురుద్దేశాలను ప్రజలు అర్థం చేసుకోవాలని మోదీ సూచించారు. అంబేద్కర్ ఇచ్చిన మీ హక్కును దోచుకునేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని చెప్పారు. పార్లమెంటులో ఎక్కువ మంది బీజేపీ ఎంపీలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారే ఉన్నారని అన్నారు. ఈ ర్యాలీలో మాజీ సీఎం యెడియూరప్ప, బీజేపీ అభ్యర్థులు గడ్డి గౌడర్, రమేశ్ జిగజినగి కూడా పాల్గొన్నారు.