కావ్య గెలుపు కోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు: కడియం శ్రీహరిపై మంద కృష్ణ మాదిగ తీవ్ర ఆరోపణలు
- ఒక్కో ఓటుకు రూ.5వేల నుంచి రూ.10వేలు ఇవ్వబోతున్నారని ఆరోపణ
- అక్రమ సంపాదన డబ్బుతో కూతురును గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న మంద కృష్ణ
- కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం శ్రీహరికి భారీగా డబ్బులు అందాయని ఆరోపణ
గత అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లో తన కూతురు కడియం కావ్యకు బీఆర్ఎస్ నుంచి టిక్కెట్ తెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడారు. తనకు స్థానిక నాయకుల నుంచి సహకారం లేదంటూ కావ్య టిక్కెట్ను తిరస్కరించి.. పార్టీని వీడారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ టిక్కెట్ పొందారు. బీఆర్ఎస్ వరంగల్ నుంచి సుధీర్ మాదిగను అభ్యర్థిగా ప్రకటించింది.