Amit Shah: ఎల్లుండి తెలంగాణకు కేంద్రమంత్రి అమిత్ షా

  • సిద్దిపేట బహిరంగ సభలో పాల్గొననున్న కేంద్ర హోంశాఖమంత్రి
  • ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి రాక
  • మధ్యాహ్నం 12 గంటల నుంచి గంటపాటు సిద్దిపేట బహిరంగ సభలో పాల్గొననున్న అమిత్ షా
  • భోజన విరామం అనంతరం 2.15 గంటలకు భువనేశ్వర్‌కు పయనం 
Amith Shah public meeting in siddipet on 25th

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 25న తెలంగాణకు రానున్నారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. గం.11.45 నిమిషాలకు సిద్దిపేట చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేటలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇక్కడ గంటపాటు బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.45 గంటలకు తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. భోజన విరామం అనంతరం 2.15 గంటలకు బేగంపేట నుంచి భువనేశ్వర్‌కు బయలుదేరుతారు.

More Telugu News