Chandrababu: శ్రీశైలంలో రుద్రాభిషేకం జరిపించిన చంద్రబాబు, భువనేశ్వరి

  • శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన చంద్రబాబు దంపతులు
  • భ్రమరాంబికా మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు
  • సాక్షి గణపతి, వీరభద్రస్వామి వార్లకు పూజలు
Chandrababu and Bhuvaneswari performs Rudrabhishekam in Srisailam

టీడీపీ అధినేత చంద్రబాబు తన అర్ధాంగి నారా భువనేశ్వరి సమేతంగా ఇవాళ శ్రీశైలం పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ఇక్కడి భ్రమరాంబికా మల్లికార్జునస్వామివారిని దర్శించుకున్నారు. మహాశివుడికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, భువనేశ్వరిలకు వేదపండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ పర్యటనలో చంద్రబాబు, భువనేశ్వరి ఇక్కడి సాక్షి గణపతి, వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు రాకతో శ్రీశైలం టీడీపీ శ్రేణుల్లో కోలాహలం నెలకొంది.

More Telugu News