కేజ్రీవాల్పై కుట్ర జరుగుతోంది... నెమ్మదిగా జైల్లోనే మరణించేలా చేస్తున్నారు: ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్
- డయాబెటిస్తో బాధపడుతున్న కేజ్రీవాల్కు ఇన్సులిన్ ఇవ్వడానికి జైలు అధికారులు నిరాకరిస్తున్నారన్న సౌరభ్
- అవయవాలపై ప్రభావం పడి అనారోగ్య సమస్యలతో నెమ్మదిగా మరణించేలా కుట్ర చేస్తున్నారని ఆరోపణ
- కేజ్రీవాల్కు ఇన్సులిన్ ఇవ్వకపోవడం వల్ల గుండె, కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుందని వ్యాఖ్య
- తర్వాత విడుదల చేసినా ప్రయోజనం ఉండదు... ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వస్తుందన్న సౌరబ్ భరద్వాజ్
ఈ నేపథ్యంలో సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ... కేజ్రీవాల్కు ఇన్సులిన్ ఇవ్వకపోవడం వల్ల గుండె, కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. దీనివల్ల రెండు, మూడు నెలల అనంతరం ఆయనను విడుదల చేసినా ఏ ప్రయోజనం ఉండదని... ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.