ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేయడమే వైసీపీ పని: నారా భువనేశ్వరి
- శ్మశానాలనూ వదల్లేదని ఆరోపణ
- రాష్ట్రంలోని వక్ఫ్ బోర్డు భూముల్లో 80 శాతం ఆక్రమణ
- ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలను అమలుచేయలేదని విమర్శ
ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలను ఐదేళ్ల పాలనలో జగన్ నెరవేర్చలేదని భువనేశ్వరి ఆరోపించారు. మిస్బా ఆత్మహత్య ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. కాగా, చంద్రబాబు 75వ పుట్టిన రోజు వేడుకను నారా భువనేశ్వరి బస చేస్తున్న పీసీఎస్ మెడికల్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిమిని రవి నాయుడు, భువనేశ్వరి టీమ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా భువనేశ్వరి కేక్ కట్ చేసి తన టీమ్ సభ్యులకు పంచారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, డాక్టర్ సురేష్, టీడీపీ కుప్పం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.