మాటలు రాక ప్రసంగాన్ని ఆపేసిన మోదీ.. కారణం ఇదే!
- మధ్యప్రదేశ్ లో ఎన్నికల సభలో పాల్గొన్న మోదీ
- మోదీ, హీరాబెన్ ఫొటోను ప్రదర్శించిన యువకుడు
- తీవ్ర భావోద్వేగానికి గురైన మోదీ
మోదీ ప్రసంగిస్తుండగా ఒక యువకుడు చేతిలో ఫొటో ఫ్రేమ్ కనిపించింది. ఆ ఫొటో మోదీ మాతృమూర్తి హీరాబెన్ ది. మోదీని ఆమె ఆశీర్వదిస్తుండగా తీసిన ఫోటో అది. పెన్సిల్ తో గీసిన ఆ చిత్రాన్ని చూసి మోదీ ఎమోషనల్ అయ్యారు. మాటలు రాక కాసేపు ప్రసంగాన్ని ఆపేశారు. ఆ చిత్రాన్ని తెచ్చిన యువకుడిని అభినందించారు. ఆ ఫొటో వెనుక అతని పేరు, చిరునామాను రాసివ్వాలని సూచించారు. తాను లేఖ రాస్తానని చెప్పారు. 2022 డిసెంబర్ 30న హీరాబెన్ 100 ఏళ్ల వయసులో కన్నుమూశారు.