పల్లా రాజేశ్వర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన కడియం శ్రీహరి
- ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వందల కోట్లు సంపాదించారని ఆరోపణ
- పల్లా రాజేశ్వర్ రెడ్డిపై భూకబ్జా కేసు ఉందన్న కడియం శ్రీహరి
- దళిత బంధు పథకంలో రాజయ్య కమీషన్లు తీసుకున్నారని ఆరోపణ
దళిత బంధు పథకంలో మాజీ మంత్రి రాజయ్య కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. అక్రమాలు చేసినట్లు నిరూపిస్తే పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజయ్యలు తమ పదవులకు రాజీనామా చేస్తారా? అని సవాల్ చేశారు. లేదంటే నేను కమీషన్లు తీసుకున్నట్లు వారు నిరూపించినా రాజీనామాకు సిద్ధమన్నారు. తనకు ఇప్పుడు 72 ఏళ్లు అనీ... మూడు దశాబ్దాల క్రితం ఉన్న శక్తి ఇప్పుడు లేదని కడియం అన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఓపిక కూడా లేదన్నారు. ఈ నాలుగేళ్లు ప్రజల కోసం మరింత కష్టపడి పని చేస్తానన్నారు.