Kachidi Fish: రెండే చేపలు.. కానీ ధర రూ.4 లక్షలు

  • అంతర్వేది తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచ్చిడీ చేపలు
  • శనివారం వేలంలో భారీ మొత్తం పలికిన వైనం
  • ఔషధ తయారీలో ఉపయోగిస్తారని చెబుతున్న మత్స్యకారులు
Krishna District Fishermen Got two Kachidi Fish

వలలో చిక్కినవి రెండే చేపలు.. అయితేనేం భారీ మొత్తాన్ని ఆర్జించిపెట్టాయి. ఒక్కోటీ ఏకంగా రూ.2 లక్షల ధర పలికాయి. దీంతో ఆ మత్స్యకారుల పంటపడింది. కృష్ణా జిల్లాకు చెందిన  మత్స్యకారులకు అంతర్వేది సముద్ర తీరంలో శనివారం 2 కచ్చిడీ చేపలు చిక్కాయి. అరుదైన ఈ చేపలను కోనసీమ జిల్లా అంతర్వేదిపల్లి పాలెం మినీ ఫిషింగ్‌ హార్బర్‌లో వేలం వేశారు. ఈ రెండు చేపలను ఓ వ్యాపారి రూ.4 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ చేపల్లో ఉండే తెల్లటి బ్లాడర్‌ ను ఔషధాల తయారీలో, శస్త్రచికిత్సలో కుట్లు వేసే దారం తయారీలో వాడతారని మత్స్యకారులు చెప్పారు. ఈ చేపలు అరుదైనవి కావడం, మందుల తయారీకి ఉపయోగపడడం వల్లే వీటికి ధర బాగా పలుకుతుందని పేర్కొన్నారు.

More Telugu News