Chiranjeevi: జాన్వీని చూడగానే శ్రీదేవి గుర్తుకొచ్చింది.. చాలా భావోద్వేగానికి గురయ్యాను: చిరంజీవి

  • 'జగదేకవీరుడు అతిలోక సుందరి' పార్ట్-2పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు
  • ఈ చిత్రాన్ని చరణ్, జాన్వీ చేస్తే చూడాలనుందని వ్యాఖ్య
  • తనకు కమర్షియల్ సినిమాలే సెట్ అవుతాయన్న మెగాస్టార్
Chiranjeevi on Jagadeka Veerudu Athiloka Sundari

చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పార్ట్-2ని తన కుమారుడు రామ్ చరణ్, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ చేస్తే చూడాలని ఉందని చిరంజీవి చెప్పారు. ఇటీవల తాను జాన్వీని కలిశానని... ఆమెను చూసిన వెంటనే శ్రీదేవీ గుర్తుకొచ్చి భావోద్వేగానికి గురయ్యానని తెలిపారు. శ్రీదేవి మరణంతో సినీ పరిశ్రమ ఒక మంచి నటిని కోల్పోయిందని చెప్పారు. బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

తనను కమర్షియల్ సినిమాల్లో చూసేందుకే ప్రేక్షకులు ఇష్టపడతారని చిరంజీవి తెలిపారు. 'దంగల్' వంటి సినిమా చేయాలని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒకసారి సలహా ఇచ్చారని... అలాంటి సినిమాలు తాను చేస్తే నిర్మాతలు నష్టపోతారని చెప్పారు. 'ఖైదీ' సినిమా తనకు ఎంతో క్రేజ్ తీసుకొచ్చిందని... 'రుద్రవీణ' సినిమా తనకు మంచి పేరు తీసుకొచ్చిందని... అయితే ఆ సినిమాకు నిర్మాతగా ఉన్న తన తమ్ముడు నాగబాబు మాత్రం నష్టపోయారని తెలిపారు. 

More Telugu News