Ramcharan: ఉపాసన, క్లీంకారతో కలిసి చెన్నై చేరుకున్న రామ్ చరణ్

  • చరణ్ కు డాక్టరేట్ ఇవ్వనున్న వేల్స్ యూనివర్శిటీ
  • యూనివర్శిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా చరణ్
  • చెన్నై ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం
Ram Charan reaches Chennai

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ ను అందుకోబోతున్నారు. తమిళనాడుకు చెందిన వేల్స్ యూనివర్శిటీ ఆయనకు డాక్టరేట్ ఇవ్వనుంది. ఈ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం ఈరోజు చెన్నైలో జరగనుంది. ఈ స్నాతకోత్సవానికి చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. ఈ సందర్భంగా చరణ్ కు గౌరవ డాక్టరేట్ ను అందజేయనున్నారు. చరణ్ కు ఈ అరుదైన గౌరవం దక్కడంతో ఆయన అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. మరోవైపు, ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి రామ్ చరణ్ చెన్నై చేరుకున్నారు. చరణ్ తో పాటు ఆయన భార్య ఉపాసన, కూతురు క్లీంకార కూడా చెన్నైకి వెళ్లారు. ఎయిర్ పోర్టు వద్ద చరణ్ కు ఘన స్వాగతం లభించింది. 

More Telugu News