Nara Lokesh: ఇకనైనా ఈ డ్రామాలు ఆపు జగన్!: నారా లోకేశ్ 

  • సీఎం జగన్ ఓ రోగిని పరామర్శిస్తున్న వీడియో పంచుకున్న నారా లోకేశ్
  • దిగజారుడు రాజకీయాలు అంటూ విమర్శలు
  • దేశంలో నీ తర్వాతే ఎవరైనా అంటూ ఎద్దేవా
Lokesh says CM Jagan should stop dramas

సీఎం జగన్ బస్సు యాత్ర చేస్తుండగా, మార్గమధ్యంలో రోడ్డు పక్కన ఆయన కోసం ఓ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుడి కుటుంబం ఎదురుచూస్తుండడం, కృత్రిమ శ్వాస తీసుకుంటూ స్ట్రెచర్ పై ఉన్న ఆ రోగిని చూసి సీఎం జగన్ తన కాన్వాయ్ ని ఆపడం, ఆయన ఆ రోగి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితి పట్ల అధికారులకు ఆదేశాలు ఇవ్వడం తాలూకు ఓ వీడియోను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

నీ ప్రచారం పిచ్చి తగలెయ్యా అంటూ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. దిగజారుడు రాజకీయాల్లో నిన్ను కొట్టే వాడు దేశంలోనే లేడని నిరూపించావ్... ఇకనైనా ఈ డ్రామాలు ఆపు జగన్ అంటూ ట్వీట్ చేశారు.

More Telugu News