Pawan Kalyan: కర్ణాటకలో పవన్ కల్యాణ్ ప్రచారం... ఇది అవాస్తవం: జనసేన పార్టీ

  • పవన్ బీజేపీ తరఫున కర్ణాటకలో ప్రచారం చేస్తారంటూ ప్రచారం
  • ఈ నెల 17న కర్ణాటక వెళతారని కథనాలు
  • కొట్టిపారేసిన జనసేన పార్టీ
  • ఈ నెల 17న పవన్... చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వెల్లడి
Janasena party clarifies Pawan Kalyan do not campaign in Karnataka

జనసేనాని పవన్ కల్యాణ్ కర్ణాటకలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై జనసేన పార్టీ స్పందించింది. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరులో బీజేపీ తరఫున ఈ నెల 17న పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని వెల్లడించింది. ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ నెల 17న టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన పార్టీ వివరించింది. ఈ పర్యటన ఇప్పటికే ఖరారయ్యిందని పేర్కొంది.

More Telugu News