Revuri Prakash Reddy: సెంటిమెంట్ కారణంగానే గతంలో కేసీఆర్ గెలిచారు: రేవూరి ప్రకాశ్ రెడ్డి

  • బీఆర్ఎస్ హయాంలో 8 వేలకు పైగా రైతుల ఆత్మహత్యలు జరిగాయన్న ప్రకాశ్ రెడ్డి
  • రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని విమర్శ
  • గత ఏడాది సరైన వర్షాలు లేకపోవడం వల్లే ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్య
KCR won with Telangana sentiment says Revuri Prakash Reddy

తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ను ఉపయోగించుకునే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ నేత రేవూర్ ప్రకాశ్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 8 వేలకు పైగా రైతుల ఆత్మహత్యలు జరిగాయని చెప్పారు. గిట్టుబాటు ధరలు ఇవ్వాలని కోరితే బేడీలు వేసి జైలుకు పంపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని విమర్శించారు. గత సీజన్ లో వర్షాలు సరిగా పడకపోవడం వల్లే ఈ ఏడాది ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టేసిందని... రాష్ట్రాన్ని రూ. 7 లక్షల కోట్ల మేర అప్పులపాలు చేశారని దుయ్యబట్టారు.

More Telugu News