Pawan Kalyan: కాసేపట్లో ప్రజాగళం సభ... తణుకు చేరుకున్న పవన్ కల్యాణ్

  • ఎన్నికల ప్రచారం ముమ్మరం చేస్తున్న కూటమి నేతలు
  • తణుకు సభకు హాజరుకానున్న చంద్రబాబు, పవన్
  • సభ ప్రారంభానికి ముందు రోడ్ షో!
Pawan Kalyan arrives Tanuku

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఈ సాయంత్రం ప్రజాగళం సభ నిర్వహించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఈ సభకు హాజరుకానున్నారు. కాగా, పవన్ కొద్దిసేపటి క్రితమే హెలికాప్టర్ లో తణుకు చేరుకున్నారు. పవన్ కు జనసేన నేతలతో పాటు టీడీపీ నేత రఘురామకృష్ణరాజు స్వాగతం పలికారు. 

ప్రస్తుతం సభా ప్రాంగణం వద్ద మూడు పార్టీల జెండాలు, అభిమానుల నినాదాలతో కోలాహలం నెలకొంది. కాగా, ఈ సభ ప్రారంభానికి ముందు చంద్రబాబు, పవన్ తణుకు పాలిటెక్నిక్ కళాశాల నుంచి నరేంద్ర సెంటర్ వరకు రోడ్ షో నిర్వహిస్తారని తెలుస్తోంది. 

తణుకు సభ అనంతరం నిడదవోలు సభకు పయనమవుతారు. నిడదవోలు సభలో చంద్రబాబు, పవన్ తో పాటు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి కూడా పాల్గొంటారు.

More Telugu News