సనత్ నగర్ లో డ్రగ్స్ పట్టివేత.. ఐదుగురి అరెస్ట్
- ఎస్ వోటీ పోలీసుల తనిఖీలో ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం
- గోవా నుంచి తిరిగి వస్తూ డ్రగ్స్ తెచ్చిన యువకులు
- పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్న అధికారులు
గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారనే సమాచారంతో రాజేంద్రనగర్ ఎస్ వోటీ పోలీసులు బుధవారం సనత్ నగర్ లో సోదాలు చేపట్టారు. ఓ ఇంట్లో ఎండీఎంఏ డ్రగ్స్ ను గుర్తించి సీజ్ చేశారు. 4 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ తో పాటు 5 గ్రాముల గంజాయి, ఓసీబీ ఫ్లేవర్స్ డ్రగ్స్ సీజ్ చేశారు. ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై ఎండీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.