Pawan Kalyan: క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం: పవన్ కల్యాణ్

  • చేబ్రోలులో గృహప్రవేశం చేసిన పవన్ కల్యాణ్
  • ఉగాది వేడుకల్లో పాల్గొన్న వైనం
  • ప్రజలంతా బాగుండాలని కోరుకుంటున్నానని వెల్లడి
Pawan Kalyan participates Ugadi celebrations in Chebrolu

జనసేనాని పవన్ కల్యాణ్, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు నేడు కాకినాడ జిల్లా చేబ్రోలులో గృహప్రవేశం చేశారు. అనంతరం వారు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ప్రజలంతా బాగుండాలని ఈ ఉగాది నాడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. 

క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. పిఠాపురం నుంచే విజయకేతనం ఎగురవేయబోతున్నామని ఆత్మవిశ్వాసం వెలిబుచ్చారు. 

ఈ క్రోధి నామ సంవత్సరం ప్రజలకు మేలు చేయాలని, మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలని ఆకాంక్షిస్తున్నట్టు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు రావాలని, క్రోధి నామ సంవత్సరంలో రైతులకు మేలు జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

More Telugu News