IPL 2024: చెన్నై స్టేడియంలోని సొంత‌ అభిమానుల‌నే ఆట‌ప‌ట్టించిన ర‌వీంద్ర జ‌డేజా.. నెట్టింట‌ వీడియో వైర‌ల్‌!

  • చిదంబరం స్టేడియంలో కేకేఆర్‌, సీఎస్‌కే మ్యాచ్‌
  • చెన్నై విజ‌యానికి 3 ప‌రుగులు కావాల్సిన స‌మ‌యంలో శివం దూబే అవుట్‌ 
  • దాంతో బ్యాటింగ్‌కు ధోనీ వస్తాడని భావించిన సీఎస్‌కే అభిమానులు
  • ఫ్యాన్స్‌కు షాకిచ్చినంత ప‌ని చేసిన జ‌డ్డూ
Ravindra Jadeja Teases Chepauk Crowd by Pretending To Walk Out To Bat Ahead of MS Dhoni During CSK vs KKR IPL 2024 Match

చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జ‌రిగిన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌), చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) మ్యాచ్ లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. చెన్నై జట్టు మరో మూడు పరుగులు చేస్తే విజయం సాధిస్తుంద‌న‌గా స్టార్ బ్యాట‌ర్‌ శివం దూబే అవుట్ అయ్యాడు. ఆ త‌ర్వాత‌ బ్యాటింగ్‌కు ఎంఎస్ ధోనీ వస్తాడని భావించిన సీఎస్‌కే అభిమానులు ధోనీ.. ధోనీ అంటూ అర‌వ‌డం ప్రారంభించారు. 

అయితే, రవీంద్ర జడేజా డ్రెస్సింగ్ రూం నుంచి బయటకు వచ్చి స్టేడియం వైపు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. మళ్లీ వెంటనే వెనక్కి వెళ్లడంతో.. బ్యాటింగ్ కు వచ్చేది ధోనీనే అని ప్రేక్షకులకు అర్థమైంది. ఇలా జ‌డ్డూ సొంత ఫ్యాన్స్‌ను ఆట‌ప‌ట్టించాడు. జడేజా అభిమానులను ఆటపట్టించిన ఈ సన్నివేశం ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో తెగ‌ వైరల్ అవుతోంది. ఇక ధోనీ మైదానం వైపు నడక ప్రారంభించడం మొదలు.. బ్యాటింగ్ పూర్తయ్యి మైదానం నుంచి బయటకు వచ్చే వరకు కొన్ని నిమిషాల పాటు ధోనీ నామస్మరణతో చిదంబరం స్టేడియం దద్దరిల్లి పోయింది.

More Telugu News