KTR: హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేది కాళేశ్వరం ప్రాజెక్టు: కేటీఆర్

  • హైదరాబాద్ ప్రజలను కాపాడేది కాళేశ్వరం ప్రాజెక్టేనని వెల్లడి
  • ప్రపంచంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారన్న మాజీ మంత్రి
  • తెలంగాణ భవిష్యత్తు తరాలకు ఇది పెద్ద వరమనేది వాస్తవమని వ్యాఖ్య
Kaleshwaram Project to the rescue of Hyderabad Citizens

కాళేశ్వరం ప్రాజెక్టు హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం ఆయన ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. హైదరాబాద్ ప్రజలను కాపాడేది కాళేశ్వరం ప్రాజెక్టే అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నప్పటికీ... తెలంగాణ భవిష్యత్తు తరాలకు ఇది పెద్ద వరమనేది వాస్తవం అన్నారు. ఈ మేరకు 'ది న్యూఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రికలో వచ్చిన వార్త క్లిప్పింగ్‌ను కేటీఆర్ జత చేశారు. మల్లన్న సాగర్ 100 ఎంఎల్‌డీ నీరు త్వరలో హైదరాబాదీయుల దాహార్తిని తీర్చనుందనేది ఆ వార్త సారాంశం. దీనిని కేటీఆర్ ట్వీట్ చేశారు.

More Telugu News