Chiranjeevi: జనసేన పార్టీకి చిరంజీవి భారీ విరాళం... రూ.5 కోట్ల చెక్ పవన్ కు అందజేత

  • నిన్న అనకాపల్లి సభలో పవన్ ప్రసంగం
  • పవన్ అమ్మవారి ఆశీస్సులు కోరుతూ చేసిన వ్యాఖ్యలతో చలించిపోయిన చిరంజీవి
  • మరుసటి రోజే భారీ విరాళం అందజేత
  • ఈ ఘట్టానికి వేదికగా నిలిచిన విశ్వంభర షూటింగ్ స్పాట్
Chiranjeevi donates Rs 5 Cr to Janasena Party

మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీకి భారీ విరాళం ప్రకటించారు. రూ.5 కోట్ల చెక్ ను ఇవాళ జనసేనాని పవన్ కల్యాణ్ కు అందజేశారు. 

చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారు ప్రాంతం ముచ్చింతల్ లో జరుగుతుండగా... పవన్ కల్యాణ్, నాగబాబు షూటింగ్ లొకేషన్ కు వెళ్లారు. తన తమ్ముళ్లకు చిరంజీవి ప్రేమపూర్వక స్వాగతం పలికారు. ఈ సందర్భంగానే జనసేన పార్టీకి ఆశీస్సులు అందిస్తూ, రూ.5 కోట్ల విరాళం తాలూకు చెక్ ను పవన్ కు అందజేశారు. ఈ సందర్భంగా భావోద్వేగాలకు గురైన పవన్ తన పెద్దన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేశారు. షూటింగ్ స్పాట్ లోనే కొణిదెల బ్రదర్స్ ముగ్గురూ కాసేపు మాట్లాడుకున్నారు. 

నిన్న అనకాపల్లిలో పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సభలో పవన్ అమ్మవారి ఆశీస్సులు కోరుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలతో చిరంజీవి కదిలిపోయారు. తన తమ్ముడికి ఆర్థికంగా అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ మరుసటి రోజే భారీ విరాళం అందించారు. 

కాగా, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా జనసేన పార్టీకి ఆర్థికంగా అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News