YS Vivekananda Reddy: వివేకా హ‌త్య కేసు.. మ‌రోసారి సుప్రీంకోర్టు మెట్లెక్కిన సునీత‌

  • నిందితుడు శివశంక‌ర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ 
  • బెయిల్‌ను ర‌ద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో సునీత పిటిష‌న్ ‌
  • నేడు పిటిష‌న్‌పై జ‌స్టిస్ దీపాంక‌ర్ ద‌త్తా, జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా ధ‌ర్మాస‌నం విచార‌ణ
YS Vivekananda Reddy Daughter Sunita once again in Supreme Court

మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ఆయ‌న కుమార్తె సునీత మ‌రోసారి సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంక‌ర్‌రెడ్డికి ఇటీవ‌ల తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విష‌యం తెలిసిందే. ఆ బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని ఆమె తాజాగా పిటిష‌న్ వేశారు. ఆ ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ సునీత సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌పై జ‌స్టిస్ దీపాంక‌ర్ ద‌త్తా, జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా ధ‌ర్మాస‌నం ఇవాళ విచార‌ణ చేప‌ట్ట‌నుంది.

More Telugu News