Devineni Uma: అందుకే జగన్ కు ఓటు వేయొద్దని ఆయన సొంత చెల్లెమ్మలే చెపుతున్నారు: దేవినేని ఉమ

  • వైసీపీ డీఎన్ఏలోనే శవరాజకీయం ఉందన్న దేవినేని ఉమ
  • వైసీసీ పాలనలో ఎస్సీలు, బీసీలపై దాడులు జరిగాయని విమర్శ
  • జగన్ లాంటి వాళ్లు సమాజానికే హానికరమని వ్యాఖ్య
Devineni Uma fires on Jagan

వైసీపీ డీఎన్ఏలోనే శవరాజకీయం ఉందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం అవ్వాతాతల ప్రాణాలను పణంగా పెడుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే 4 వేల పెన్షన్ ఇంటి వద్దే అందిస్తామని చెప్పారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎస్సీలు, బీసీలపై దాడులు, దౌర్జన్యాలు జరిగాయని... దళితులను చంపి డోర్ డెలివరీ చేశారని అన్నారు. వారిపై 6 వేల తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారు సమాజానికే హానికరమని... అందుకే జగన్ కు ఓటు వేయొద్దని ఆయన సొంత చెల్లెమ్మలే చెపుతున్నారని అన్నారు.

More Telugu News