Stock Market: కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 351 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 80 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3 శాతానికి పైగా లాభపడ్డ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు విలువ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతుతో మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 351 పాయింట్ల లాభంతో 74,228కి చేరుకుంది. నిఫ్టీ 80 పాయింట్లు పెరిగి 22,515 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (3.06%), టైటాన్ (1.98%), టెక్ మహీంద్రా (1.74%), ఏసియన్ పెయింట్స్ (1.72%), టీసీఎస్ (1.41%). 

టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.52%), భారతి ఎయిర్ టెల్ (-1.44%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-1.01%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.96%), ఐటీసీ (-0.60%).

More Telugu News