అడవి ఏనుగు దాడిలో తెలంగాణ రైతు మృతి
- కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం ఘటన
- తన మంద నుంచి తప్పిపోయి తెలంగాణలోకి వచ్చిన మగ ఏనుగు
- బూరెపల్లి గ్రామంలో పొలంలోని రైతుపై దాడి
- ఘటనా స్థలంలోనే రైతు మృతి
- బాధితుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన అటవీ శాఖ
అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఏనుగుల మంద ఒకటి ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్ర గడ్చిరోలికి వచ్చింది. అయితే, మంద నుంచి తప్పిపోయిన ఓ మగ ఏనుగు ప్రాణహిత నది దాటి తెలంగాణలోకి వచ్చింది. ఈ క్రమంలో రైతుపై దాడి చేయడంతో మృతి చెందాడు.
మరోవైపు, బాధిత కుటుంబానికి అటవీ శాఖ రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. దారి తప్పిన మగ ఏనుగును మళ్లీ ఏనుగుల గుంపుతో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.