IPL 2024: వైజాగ్ లో నేడు మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్... టాస్ గెలిచిన కోల్ కతా

  • ఐపీఎల్ లో నేడు కేకేఆర్ × ఢిల్లీ క్యాపిటల్స్
  • విశాఖ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్ కతా
KKR won the toss against DC in Vizag

వైజాగ్ లోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం ఐపీఎల్ లో నేడు మరో మ్యాచ్ కు ఆతిథ్యమిస్తోంది. బ్యాటింగ్ స్వర్గధామంలా పేరుపొందిన ఈ మైదానంలో తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. 4 ఓవర్లు ముగిసేసరికి కోల్ కతా వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ 16, సునీల్ నరైన్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. నరైన్ 15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు.

ఈ సీజన్ లో కోల్ కతా ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ ల్లో నెగ్గి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు ఢిల్లీ జట్టు ఆడిన 3 మ్యాచ్ ల్లో రెండింట్లో ఓడిపోయి, ఒక మ్యాచ్ లో నెగ్గింది. ఈ మ్యాచ్ ఢిల్లీకి ఎంతో కీలకం. 

ఇరుజట్లలోనూ గమనించదగ్గ ఆటగాళ్లు...

కోల్ కతా నైట్ రైడర్స్: రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, శ్రేయాస్ అయ్యర్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి.

ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, ట్రిస్టాన్ స్టబ్స్.

More Telugu News