IPL: ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లను రీషెడ్యూల్ చేసిన బీసీసీఐ

  • ఉత్సాహంగా సాగుతున్న ఐపీఎల్ తాజా సీజన్
  • కేకేఆర్-రాజస్థాన్... గుజరాత్-ఢిల్లీ మ్యాచ్ ల తేదీలు మార్చిన బీసీసీఐ
  • నేడు ఓ ప్రకటనలో వెల్లడి 
BCCI reschedules two matches in IPL

క్రికెట్ వినోదానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఐపీఎల్ జోరుగా సాగుతోంది. కాగా, ఈ సీజన్ లో రెండు మ్యాచ్ లను రీషెడ్యూల్ చేసినట్టు బీసీసీఐ వెల్లడించింది. కోల్ కతా నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్... గుజరాత్ టైటాన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ల తేదీలను మార్చినట్టు నేడు ఓ ప్రకటనలో తెలిపింది. 

కోల్ కతా నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ముందు పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 17న జరగాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్ ను ఒక రోజు ముందుకు, అంటే ఏప్రిల్ 16కి మార్చారు. ఈ మ్యాచ్ కు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిలవనుంది. 

అటు, గుజరాత్ టైటాన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ తొలుత పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 16న జరగాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్ ను ఆ మరుసటి రోజుకు, అంటే ఏప్రిల్ 17వ తేదీకి రీషెడ్యూల్ చేశారు. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.

More Telugu News