Soubin Shahir: గుహలో చిక్కుబడిన ఫ్రెండ్ కోసం 'మంజుమ్మల్ బాయ్స్' సాహసం!

  • మలయాళంలో హిట్ కొట్టిన 'మంజుమ్మల్ బాయ్స్'
  • తమిళం నుంచి వచ్చిన సక్సెస్ టాక్ 
  • 20 కోట్లతో 235 కోట్లు రాబట్టిన సినిమా 
  • ఈ నెల 6 నుంచి తెలుగు ప్రేక్షకుల ముందుకు    

Manjummel Boys Movie Update

ఈ ఏడాదిలో మలయాళం నుంచి మూడు ఇండస్ట్రీ హిట్లు పడ్డాయి. ఆ జాబితాలో 'మంజుమ్మల్ బాయ్స్' ఒకటిగా కనిపిస్తుంది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈసినిమా, ఫిబ్రవరి 22వ తేదీన మలయాళంలో విడుదలైంది. పరవ ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో, సౌబిన్ షాహిర్ .. శ్రీనాథ్ భాసి .. బాలు వర్గీస్ .. గణపతి ప్రధానమైన పాత్రలను పోషించారు.

మలయాళంలో 20 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా, 235 కోట్లను వసూలు చేసింది. ఇటీవలే తమిళ ప్రేక్షకులను సైతం పలకరించింది. అక్కడ కూడా సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఈ నెల 6వ తేదీన ఇక్కడి థియేటర్లలో దిగనుంది. మైత్రీ మూవీస్ వారు ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నారు.  సుశీన్ శ్యామ్ సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలవనుంది. 

కేరళ ప్రాంతానికి చెందిన కొంతమంది కుర్రాళ్లు విహారయాత్ర పేరుతో కొడైకెనాల్ చేరుకుంటారు. అక్కడి గుహలోకి వాళ్లంతా చాలా ఉత్సాహంతో ప్రవేశిస్తారు. మిత్ర బృందంలో ఒకరు ఆ గుహలో చిక్కుబడతారు. రెస్క్యూ టీమ్ కూడా చేతులెత్తేస్తుంది. అప్పుడు మిగతా ఫ్రెండ్స్ కలిసి ఏం చేస్తారనేది కథ. సర్వైకల్ థ్రిల్లర్ జోనర్లో నడిచే ఈ సినిమా, ఇక్కడి ఆడియన్స్ ను ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది చూడాలి. 

More Telugu News