Congress: తెలంగాణలో ఎంపీ స్థానాలకు ఇన్చార్జిలను ప్రకటించిన కాంగ్రెస్

  • మే 13న తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు
  • మొత్తం 17 ఎంపీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు
  • ఇన్చార్జిల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ హైకమాండ్ 
Congress announces incharges for Lok Sabha constituencies in Telangana

తెలంగాణలో  మే 13న లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఈ ఎంపీ స్థానాలన్నింటికీ ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ  తెలంగాణలోని లోక్ సభ స్థానాలకు ఇన్చార్జిలను ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపుగా మంత్రివర్గంలోని సీనియర్లందరినీ లోక్ సభ స్థానాల ఇన్చార్జిలుగా నియమించారు.

తెలంగాణలో కాంగ్రెస్ లోక్ సభ ఇన్చార్జిల జాబితా...

1. సికింద్రాబాద్- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
2. హైదరాబాద్- ఒబేదుల్లా కొత్వాల్
3. జహీరాబాద్- దామోదర రాజనర్సింహ
4. ఖమ్మం- పొంగులేటి శ్రీనివాసరెడ్డి
5. ఆదిలాబాద్- ధనసరి సీతక్క
6. నల్గొండ- ఉత్తమ్ కుమార్ రెడ్డి
7. నిజామాబాద్- సుదర్శన్ రెడ్డి
8. కరీంనగర్-పొన్నం ప్రభాకర్
9. మెదక్- కొండా సురేఖ
10. పెద్దపల్లి- శ్రీధర్ బాబు
11. మల్కాజిగిరి- మైనంపల్లి హన్మంతరావు
12. వరంగల్- ప్రకాశ్ రెడ్డి
13. చేవెళ్ల- నరేందర్ రెడ్డి
14. మహబూబాబాద్- తుమ్మల నాగేశ్వరరావు
15. నాగర్ కర్నూల్- జూపల్లి కృష్ణారావు
16. భువనగిరి- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 
17. మహబూబ్ నగర్- సంపత్ కుమార్

More Telugu News