ఆయన నాకు దేవుడితో సమానం: విజయసాయిరెడ్డి
- నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి
- కందుకూరు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన విజయసాయి
- మహీధర్ రెడ్డి తనకు చేసిన మేలు మర్చిపోలేనని వ్యాఖ్య
మహీధర్ రెడ్డి కందుకూరులో పోటీ చేయాలని తాను కోరుకున్నానని... అయితే సోషల్ ఇంజినీరింగ్ లో భాగంగా పార్టీ అధినేత జగన్ బీసీ అభ్యర్థికి టికెట్ కేటాయించారని విజయసాయి తెలిపారు. భవిష్యత్తులో కూడా మహీధర్ రెడ్డి ఆలోచనల మేరకే కందుకూరులో పాలన ఉంటుందని చెప్పారు. మహీధర్ రెడ్డి ప్రజా సేవలోనే ఉండాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి పార్టీ గౌరవిస్తుందని హామీ ఇచ్చారు.